సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు కేరళలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ సినిమా పూర్తి స్థాయి ప్రమోషన్స్ మొదలు పెట్టనే లేదు. అయితే సినిమా ఇండియా బిజినెస్ దాదాపుగా పూర్తి అయిపోయింది. కర్నాటక తప్ప అన్ని చోట్లా క్లోజ్ అయ్యింది.
కర్నాటక రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఎనిమిది కోట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది ఇలా ఉండగా అల వైకుంఠపురములో సినిమాతో క్లాష్ నివారించేందుకు సరిలేరు నీకెవ్వరు జనవరి 11నే విడుదల అవుతుందని సమాచారం. అదే జరిగితే మొదటి రోజు భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉందట.
సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.