నవరసాల్లో హాస్యర సానికి చాల ప్రాధాన్యత ఉంది. అందరు నవ్వగలరు. కానీ కొందరే నవ్వించ గలరు. కొందర్ని చూస్తేనే నవ్వ వస్తుంది. సినిమా రంగంలో లాంగ్ టైమ్ కెరీర్ కంటిన్యూ చేసిన ఏ కమడియన్ కెరీర్ గ్రాఫ్ చూసినా..స్క్రీన్ మీద అతన్ని చూడగానే ఎలా వున్నా ఆడియన్స్ ముందు నవ్వుతారు. తొలి తరం లో అలా నవ్వించ గలిగిన వారి లో రమణా రెడ్డి, రేలంగి , రాజబాబు.. పద్మనాభం, ఆ తరువాత బ్రహ్మానందం, సుత్తి వేలు .. ఇప్పటి జనరేషన్ లో అలీ, సునీల్, సప్తగిరి , వెన్నెల కిషోర్ ఉన్నారు. అయితే దర్శక దిగ్గజం స్వర్గీయ జంధ్యాల ఏకంగా కామెడిని హీరో చేసేశారు. రాజేంద్ర ప్రసాద్ ను హస్య బ్రహ్మా ను చేశారు. అయితే కమెడియన్స్ హీరో కావడం అనేది అలీ అప్పటి నుంచి చూస్తున్నాం. అయితే అలీ తెలివిగా హీరో వేషానే నమ్ముకోకుండా.. ఇతర చిత్రాల్లో కూడా సమాంతరంగా కమెడియన్ గా చేస్తూ సేఫ్ జోన్ లో ఉంటూ తెలివిగా కెరీర్ కొన సాగించాడు.. ఎందుకంటే కమెడియన్ ను హీరోగా రిసీవ్ చేసుకోవడం అనేది తాత్కలికం అనే విషయం ముందుగానే అలీ అంచన వేయగలిగాడు.
ఇదే వరసలో అందాల రాముడు చిత్రంతో భీమ వరం కుర్రాడు సునీల్ కూడా హీరో అవతారం ఎత్తాడు . ఆ తరువాత ఆఫర్స్ పెద్దగా రాలేదు. అయితే `ఈగ` చిత్రం తరువాత రాజమౌళి సరదగా స్టార్ హీరోలతో చేయకుండా.. ఒక ఇమేజ్ లేని నటుడితో సినిమా చేద్దామని చేసిన చిత్రం మర్యాద రామన్న.
సునీల్ ను హీరోగా ఎస్టాబ్లీష్ చేసింది. ఆ తరువాత వీరభద్రమ్ అనే దర్శకుడు సునీల్ తో చేసిన `పూల రంగడు` చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో సునీల్ ఇతర చిత్రాల్లో కమెడియన్ గా నటించడం మానేసి..పూర్తి స్థాయి హీరోగా చేయడానికి డిసైడ్ అయ్యాడు. అంతే వరస ప్లాప్స్… కట్ చేస్తే సునీల్ కెరీర్ డైలామా లో పడింది. నిదానంగా తన ప్లేస్ ను ఇతర కమెడియన్స్ కవర్ చేసేశారు. ఇప్పుడు సునీల్ పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది.
అయితే సప్తగిరి మాత్రం ఒక కమెడియన్ కెరీర్ ఎలా వుంటుందో అనే విషయం సునీల్ ను చూసి బాగానే తెలుసుకున్నట్లున్నాడు. తను డెబ్యూ హీరోగా పరిచయం అయిన చిత్రం `సప్తగిరి ఎక్స్ ప్రెస్` ఒక మాదిరిగా నడిచింది. అదే సినిమా నిర్మాత తో తాజాగా `సప్తగిరి ఎల్ ఎల్ బి` చిత్రం చేశాడు.తను కేవలం హీరో గా మాత్రమే కాదు.. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే హీరోగా చేస్తూ… మిగిలిన సమయంలో యధా విధిగా కమెడియన్ గా ఇతర చిత్రాలు చేస్తున్నట్లు పప్తగిరి ఓపెన్ గానే చెప్పాడు. దీంతో తన సహ కమెడియన్ సునీల్ ను చూసి సప్తగిరి ముందుగానే మెల్కొన్నట్లు అయ్యింది కదా.! ఏది ఏమైనా సప్తగిరి తీసుకున్న నిర్ణయం సరైందే మరి!.