Allu-Arjun-Vs-Mahesh-Babuసంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కయ్యానికి కాలుదువ్వబోతున్నాయి. అయితే ఇప్పటి నుండే పోటీకి సిద్ధం అవుతున్నాయి. ఎందుకో తెలీదు గానీ ఈ సారి కొంచెం బన్నీ పంతంగానే ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరూ టీం ఏదో ఒక ప్రమోషన్ చేస్తే వెంటనే అదే సమయానికి తన సినిమాకు సంబంధించి ఏదో ఒకటి విడుదల చేస్తున్నాడు.

అలా ఇప్పటిదాకా చాలా సార్లు జరిగింది. తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ఇలాగే చెయ్యబోతున్నాడంట బన్నీ. సరిలేరు నీకెవ్వరూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ లో జరుగుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దాని కోసం ఎల్బీ స్టేడియంని వేదికగా కూడా బుక్ చేసింది.

ఇప్పుడు అదే రోజున అదే సమయానికి బన్నీ తన అల వైకుంఠపురములో ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరపాలని భావిస్తున్నాడట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుంది. పాటలు, టీజర్ల వరకూ అంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్లు క్లాష్ అంటే ఇబ్బందే. లక్షలు ఖర్చుపెట్టి చేసే ఈవెంట్లకు మైలేజ్ రాకపోతే ఇరు సినిమాలకు ఇబ్బందే.

ఒకే సమయంలో రెండు పెద్ద ఈవెంట్లు జరిగితే టీవీ రేటింగ్స్ కూడా తగ్గిపోతాయి. అది అల వైకుంఠపురములో కి కూడా మంచిది కాదు. దీనిపై ఆ చిత్రబృందం పునరాలోచించుకుంటే వారికే మంచిది. పైగా టీవీ వారు రైట్స్ కు ఇచ్చే సొమ్ములు కూడా తగ్గించేస్తారు.