Sankalp Reddyదక్షిణాది భాషల్లో ఇంతవరకూ పూర్తిస్థాయి అంతరిక్ష నేపథ్యం కలిగిన సినిమా రాలేదు. తమిళంలో జయం రవి చేసిన ఈ తరహా మూవీ, ఈ నెల 26వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. అలాంటి నేపథ్యం కలిగిన సినిమానే ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు.

కథా పరంగా వరుణ్ తేజ్ తీసుకోవలసిన శిక్షణ గురించి కూడా చెప్పాడట. దాంతో ఆ విషయంపై ఆయన కసరత్తు మొదలెట్టాడని అంటున్నారు. సాధారణంగా ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే కేవలం 25 కోట్లతోనే ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ‘ఘాజీ’ సినిమాను కూడా ఆయన తక్కువ బడ్జెట్ లోనే చేయడం వలన, నిర్మాతలు బలమైన నమ్మకంతోనే వున్నారు.