Samantha-Ruth-Prabhu-Visited-Tirumala Tirupatiకలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి ఉన్న విశిష్టత ఏమిటో తెలియనిది కాదు. సామాన్య ప్రజల నుండి సైంటిస్టుల వరకు తమ తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో, సెంటిమెంట్ ను నిలబెట్టుకునే పనిలో తిరుమలను సందర్శిస్తుంటారు. అయితే ఈ ఒరవడి సినీ, రాజకీయ నాయకులకు కాస్త ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు వారి వారి సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఆ వేంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది.

‘మనం’ సినిమా నుండి ‘కింగ్’ నాగార్జున కూడా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. మే 26వ తేదీన చైతూ నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… మూడు రోజుల క్రితం నాగార్జున బావ (సోదరి భర్త) అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. దీని వలన సినిమానే వాయిదా పడుతుందని భావించిన నేపధ్యంలో… సినిమా కాదు గానీ ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేయగా, సినిమాను అనుకున్న సమయానికి మే 26వ తేదీనే విడుదల చేయబోతున్నారు.

అయితే బావ అకాల మరణంతో కృంగిపోయి ఉన్న అక్కినేని కుటుంబం తరపున “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా విడుదలకు ముందు, కాబోయే కోడలు సమంత కలియుగ దైవం దర్శనం చేసుకోవడం ప్రాధాన్యతను దక్కించుకుంది. అక్కినేని ఇంటిలో అడుగు పెట్టకముందే కుటుంబం తరపున సమంత బాధ్యతలు తీసుకుని, అందుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాబోయే శ్రీవారి సినిమా విడుదల కదా… ఆ మాత్రం చేయడంలో వింతేముంది… అన్న మాటలు వినపడుతున్నాయిలేండి..!