Samantha Akkineni - Prashanth Varmaఅ! సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఇంప్రెస్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కడంతో ఆయన పేరు మారుమోగి పోయింది. విభిన్నంగా తీసుకుని చేసిన అ! కు సీక్వెల్ వస్తుందని చాలా కాలంగా వార్తలు వినిపించాయి. అ! సీక్వెల్ కథ రెడీ చేసి సమంత కి వినిపించాడట ప్రశాంత్ వర్మ.

ఆ సినిమాలో కూడా జాంబీల మీద ఉండేలా రాసుకున్నాడట. కథ వినగానే సమంతకు నచ్చినా జాంబీల కథ అనగానే ఏ మేరకు ఎగ్జిక్యూట్ చెయ్యగలరు అనే సంశయంతో సమంత అప్పుడు ఒప్పుకోలేదట. అయితే జాంబీలు ప్రధానంగా ఉండే జాంబీ రెడ్డి తీశాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాలో జాంబీల పార్టు చూసి సమంత ఫ్లాట్ అయ్యిందట.

అ! సీక్వెల్ చేసుండాల్సింది అని ఫీల్ అయ్యిందట. బహుశా జాంబీ రెడ్డి సినిమా సక్సెస్ అయితే అ! సెక్యూల్ మళ్ళీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. జాంబీ రెడ్డి ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూనియర్ ఇంద్రసేనా రెడ్డి తేజ సజ్జా హీరోగా దక్షా, ఆనందీ హీరోయిన్లుగా ఈ సినిమా ఉంటుంది.

ఒక పిచ్చి సైంటిస్ట్ కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నంలో ఒక జాంబీ వైరస్ పుడుతుంది. అక్కడ నుండి కథ మొదలు అవుతుంది. జాంబీ వైరస్ ని కడప, కర్నూల్ రెడ్ల మధ్య ఉండే ఫ్యాక్షన్ గొడవలతో చొప్పించి ఈ కథని రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ.