Samantha- Akkineni - busy with digital platformsపెళ్లి తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది సమంత. ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘జాను’ వంటి కూల్ మూవీస్‌లో కథానాయికగా అలరించింది. ‘జాను’ తర్వాత సమంత అక్కినేని ఏ సినిమా చేయబోతోంది అనే దాని మీద క్లారిటీ లేదు. రెండు తమిళ సినిమాలు మాత్రం ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా డిజిటల్ లో కూడా బిజీ అవుతుంది సమంత. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌ లో ఆమె ఒక కీలక పాత్ర చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.

మరోవైపు సమంత ఇంకో ఓటీటీ యాప్ తో మంతనాలు జరుపుతుందని సమాచారం. ఇటీవలే డిజిటల్ రంగంలోకి ఎంటర్ అయిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం సమంతతో ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలోనే ఈ రియాలిటీ షో ఉండబోతుందని సమాచారం.

అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం చర్చలు ప్రాధమిక స్థాయిలోనే నడుస్తున్నాయని, పూర్తి వివరాలు ఫైనల్ అయ్యాకా సమంత దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందని సమాచారం. మరోవైపు సమంత తరువాత చెయ్యబోయే తెలుగు సినిమా ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.