Samantha Akkineni back to Shootings after 6 monthsసుమారు ఆరు నెలల విరామం తరువాత, సమంతా అక్కినేని కెమెరా ముందుకు వచ్చింది. ఈ నటి ప్రస్తుతం ఈ-కామర్స్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రా కోసం ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో ఉంది. నిర్దిష్టమైన కరోనా జాగ్రత్తల మధ్య జరుగుతున్న ఈ షూటింగ్ మరో రెండు రోజులు పాటు కొనసాగుతుందని సమాచారం.

సమంత ఈ మధ్యనే మింత్రా బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపబడింది. ఇప్పటికే నాగార్జున ప్రస్తుత పరిస్థితిని ధైర్యం చేసి షూటింగ్ మొదలు పెట్టారు. దానితో అదే కుటుంబం నుండి ఇద్దరు కెమెరా ముందుకు వచ్చినట్టు అయ్యింది. నాగార్జున ఇటీవల బిగ్ బాస్ 4 ప్రోమో కోసం షూట్ చేసారు. వచ్చే నెల నుండి ఈ షో కోసం షూటింగ్ చేయనున్న విషయం తెలిసిందే.

ఈ సంవత్సరం ప్రారంభంలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కోసం సమంత చివరి సారిగా కెమెరా ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఆమె ఏ చిత్రం షూటింగులోనూ పాల్గొనకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ నటి చేతిలో తెలుగు సినిమాలు లేవు. కానీ అప్పటికే ఆమె రెండు తమిళ చిత్రాలకు సంతకం చేసింది.

ఆమె అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పటి నుండి ఆమె సంతకం చేసిన చిత్రాల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు ఇప్పటికే స్వస్తి చెప్పేసింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఆమె మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం దక్కింది.