యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై స్పందించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ… పాకిస్థాన్ నటులకు మద్దతు తెలిపారు.
పాకిస్థాన్ సినీ నటులు భారత్ కు రావాలని పిలుపునిచ్చారు. యూరీ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులే కానీ, నటీనటులు కాదని సల్మాన్ అన్నాడు. పాక్ ఆర్టిస్టులు ఉగ్రవాదులు కాదని పేర్కొన్నాడు. నటీనటులు, ఉగ్రవాదులు వేర్వేరు అని పేర్కొన్నాడు. సరైన వీసా వర్క్ పర్మిట్ తో భారత్ కు రావాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది పాక్ కళాకారులకు ఇక్కడ నివసించడానికి వాలిడ్ వీసా ఉందని అన్నారు.
ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండాలని పేర్కొన్నాడు. ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కూడా ఈ రోజు స్పందిస్తూ పాక్ పాకిస్థాన్ నటీనటులు, టెక్నీషియన్లపై నిషేధం విధించినట్లు ఈ రోజు పేర్కొంది. సదరు అసోసియేషన్ భారత ప్రొడ్యూసర్లు పాక్ ఆర్టిస్టులతో కలిసి పని చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.