Sai Madhav Burra on RRR movie subjectఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు డైలాగులు రాస్తున్న రచయిత సాయి మాధవ్ బుర్రా ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి చాలా గొప్పగా చెప్పి అభిమానులను మరింత ఉత్సాహ పరిచారు. “ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్టు అది. బాహుబలికే నేను రాజమౌళితో పని చెయ్యాల్సి ఉంది అయితే మిస్ అయ్యా. ఆర్ఆర్ఆర్ చాలా గొప్ప కథ. ఆ కథ విన్నప్పుడు కథ ఇలా కూడా ఆలోచించొచ్చా, ఇలా కూడా కథ రాయొచ్చా అనుకున్నా,” అని చెప్పుకొచ్చారు.

“రాజమౌళిగారి క్లారిటీ చాలా అద్భుతం. ఆల్రెడీ ఆయన మనోఫలకంలో కథ చేసేసుకున్నారు. ఇప్పుడు దానిని మనకి చూపించడానికి ఏం చెయ్యాలో అది చేస్తున్నారు అంతే,” అని రాజమౌళి పై పొగడ్తలు కురిపించారు ఆయన. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రలో ఎవరు చెయ్యబోతున్నారు అనేది ఇంకా చెప్పలేదు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.