Sai-dharam-tej-sahasam_swasaga_sagipoతమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దయ వలన తానూ మూడు సార్లు ప్రేమలో పడ్డానని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అన్నాడు. “సాహసం శ్వాసగా సాగిపో” ఆడియో వేడుకలో ప్రసంగిస్తూ… ‘ఘర్షణ’ చూసిన తరువాత బాగా చదువుకున్న అమ్మాయితో ప్రేమలో పడాలని భావించి, అమెరికాలో ఉన్న ఓ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్లానని అన్నాడు. తాను వెళ్లే సరికే అక్కడ ఎవడి ప్రేమలోనో ఆ అమ్మాయి పడిపోయిందని, దీంతో చేసేది లేక వెనక్కి వచ్చేశానని చెప్పి నవ్వులు పూయించాడు.

ఆ తరువాత ‘ఏం మాయ చేశావే’ చూసి ఇంకో అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. ఆ అమ్మాయి ‘ముందు కెరీర్ మీద ధ్యాస పెట్టు’ అని సూచించడంతో అదీ వర్కౌట్ కాలేదని చెప్పాడు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చూసి మరో అమ్మాయి ప్రేమలో పడితే తను కూడా హ్యాండిచ్చిందని తెలిపాడు. ఇలా లాభం లేదని ‘సాహసం శ్వాసగా సాగిపో’ అని నిర్ణయించుకున్నానని సాయిధరమ్ తేజ్ చమత్కరించడంతో సభికుల క్లాప్స్ తో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది.

మెగా హీరోలు మంచి మాటకారులు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. వాటిని సార్ధకం చేసే విధంగా సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. అక్కినేని వారి ఆడియో వేడుకలో హైలైట్ గా ఈ మెగా ప్రసంగం నిలవడం విశేషం. చిరంజీవి మొదలు చెర్రీ, బన్నీలు తన వాక్చాతుర్యాన్ని ఇప్పటికే చాటుకోగా, వరుణ్, సాయిలు ఇప్పుడిప్పుడే తమ మెగా స్థాయికి చేరుకుంటున్నారు. మరో విశేషమేమిటంటే… తనకు మాట్లాడడం రాదు రాదు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘ ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.