వరుస కమర్షియల్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా కనపరుస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, శనివారం నాడు ‘తిక్క’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సాయి, తాజాగా ఓ సమాచారాన్ని వెల్లడించాడు.
సందీప్ కిషన్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకేక్కిస్తోన్న “నక్షత్రం” సినిమాలో ఓ 20 నిముషాల పాటు ఉండే అతిథి పాత్రను పోషించబోతున్నానని స్పష్టం చేసాడు. హీరోల నుండి అవార్డులు అందుకునే అభినయాలు రాబట్టడంలో కృష్ణవంశీ ఆరితేరిన వారన్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో కూడా హావభావాలు పలికించని పక్షంలో, ఇక ఆ హీరోకు మనుగడ ఉండదన్న టాక్ కూడా ఉంది.
దీంతో ఓ పక్కన కమర్షియల్ హీరోగా ఎదుగుతున్న స్థాయిలో… మరో పక్కన కృష్ణవంశీ లాంటి దర్శకులతో పని చేయడం, సాయిధరమ్ తేజ్ ప్లానింగ్ బాగుందంటూ సినీ విశ్లేషకులు కితాభిస్తున్నారు. ఆగష్టు 16 నుండి “నక్షత్రం” సెట్స్ లోకి ఎంటర్ కాబోతున్నాడు ఈ మెగా ‘తిక్క’ హీరో!