మెగాస్టార్ చిరంజీవి నాటిన మెగా వృక్షం క్రిందకి మరో మెగా హీరో చోటు సంపాదించుకోబోతున్నాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హీరోగా పరిచయం చేయబోతోంది. బడా చిత్రాలను నిర్మించే ఈ సంస్థ నుండి వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడంటే అదృష్టమనే చెప్పుకోవాలి.
అలాగే మైత్రీతో పాటు ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ బ్యానర్ ‘సుకుమార్ రైటింగ్స్’ కూడా ఇందులో భాగస్వామి కాబోతోంది. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తుండడం మరో చెప్పుకోదగిన అంశం.
అరంగ్రేటంలోనే వైష్ణవ్ అదరగొట్టేసే విధంగా రంగం సిద్ధమవుతోంది. హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల విభాగం పేర్లు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. వైష్ణవ్ ఎంట్రీతో మెగా కాంపౌండ్ హీరోల సంఖ్య 10కి చేరింది. చిరు, పవన్, నాగబాబు, బన్నీ, చెర్రీ, శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లు ఇప్పటికే మెగాస్టార్ నీడన ఉన్న విషయం తెలిసిందే.