బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తోన్న “సాక్ష్యం” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. 138 నిముషాల నిడివి గల కట్ చేసిన ట్రైలర్ లో టైటిల్ కు తగ్గ టెంపో మిస్ అయినట్లుగా కనపడుతోంది. భువిలో జరిగే ప్రతి కార్యానికి పంచభూతాలే ‘సాక్ష్యం’ అన్న థీమ్ తో రాబోతున్న ఈ సినిమా, ఆ థీమ్ ను ఈ ట్రైలర్ ద్వారా సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమైంది.
విజువల్ గా ఏ పెద్ద హీరో సినిమాకు తగ్గనంత గ్రాండ్ నెస్ కనపడుతోంది. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నీ ఇలాగే రీచ్ గా ఉంటాయి. ఆ గ్రాండ్ నెస్ అయితే కనపడుతోంది గానీ, ట్రైలర్ ను కట్ చేసిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదు. బహుశా సిల్వర్ స్క్రీన్ పై ఈ ముక్కలన్నీ మిక్కిలి ఉత్సాహాన్ని కలిగిస్తాయేమో వేచిచూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ అయిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్.
చిన్నతనంలో విలన్స్ నుండి బయటపడిన హీరో, తన రివేంజ్ ను ఎలా తీర్చుకున్నారు? దానికి పంచభూతాలు ఎలా సహకరించాయి? దానికి ప్రకృతి ఎలా “సాక్ష్యం”గా నిలిచింది అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అగ్రెసివ్ గా ఉండగా, హీరోయిన్ పూజా సంప్రదాయ లుక్ లో కనిపించడం కొసమెరుపు. ‘డిక్టేటర్’ తర్వాత శ్రీవాస్ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతోంది.