Saaho Teaser talkయంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లలో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. ‘మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయి లో ఉంది. ముఖ్యంగా యాక్షన్ సెక్యూన్సెస్ అయితే ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో రానట్టుగా ఉన్నాయి. అక్కడక్కడా ప్రభాస్ కొంత నిరాశపరిచినా కొన్ని షాట్స్ లో మాత్రం స్టైలిష్ గా ఉండి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ప్రభాస్ ని చూపించడం కంటే సినిమాలోని స్టైలిష్ కంటెంట్ ను ఎక్కువ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు.

శ్రద్ధా కపూర్ తన మొదటి తెలుగు సినిమాలో మంచి పాత్రే పట్టినట్టుగా ఉంది. టీజర్ లో కూడా ఆమెకు ప్రాముఖ్యత ఇచ్చారు. టీజర్ లో వాడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది. టీజర్‌ చివర్లో దుండగుల నుంచి ప్రభాస్‌, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడుగుతారు. ఇందుకు ప్రభాస్‌.. ‘ఫ్యాన్స్‌’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ఈ డైలాగ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. తొందర్లోనే ఆస్ట్రియా వెళ్ళి ఒక పాట అక్కడ చిత్రీకరిస్తారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి రిలీజ్ కావడంతో సినిమా ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.