యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని తొలి పాట టీజర్ వచ్చేసింది. ‘సైకో సయ్యాన్.. ’ అంటూ సాగే ఈ పాట ప్రభాస్ అభిమానులను నిరాశపరచింది. ఈ సాంగ్ టీజర్ లో ప్రభాస్ కంటే శ్రద్ధా కపూర్ ని ఎక్కువగా ఫోకస్ చేశారు. తన అందచందాలతో, డాన్సులతో శ్రద్దా ఇరగదీసింది. ప్రభాస్ హ్యాండ్సమ్గా కనిపించినా ఎనర్జీ లేదు. డాన్సు స్టెప్పులు కూడా ఏమీ లేవు. చివరిలో ఆ బైక్ షాట్ ఇంతకు ముందు చూసినదే ఐన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరట నిచ్చింది.
దేశవ్యాప్తంగా ప్రభాస్ ను ప్రమోట్ చెయ్యాలనుకున్నప్పుడు విడుదల చెయ్యాల్సిన టీజర్ అయితే ఇది కాదు. ఇది ఏదో ఒక అనామక హీరో శ్రద్ధా కపూర్ ను చూపించి సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంది. ఇంకో గమనించదగిన విషయం ఏమిటంటే పాటను హిందీలో షూట్ చేసి ఆ తరువాత తెలుగులో డబ్ చేశారు. పాట గురించి జస్ట్ 30 సెకండ్స్ టీజర్ తో ఇప్పుడే చెప్పలేం. పూర్తి పాట ను త్వరలో జులైన 8న విడుదల చేయనున్నారు.
అప్పుడు మనకు ఒక ఐడియా రావొచ్చు. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 00 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి.