భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో చిత్రం రీసెంట్గా ఆస్ట్రియాలోని ఇన్స్బర్క్, టిరోల్లో సాంగ్ చిత్రీకరణని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రేపు చిత్ర బృందం సినిమాలోని మొదటి పాట ప్రోమో విడుదల చేస్తున్నట్టు సమాచారం. మరి కొద్ది గంటలలో రానున్న అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో చిత్ర ప్రమోషన్లు మొదలయ్యినట్టే. ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సినిమా విడుదల అవుతుంది.
సాహో చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. దక్షిణాదిన ఇదే ఆమె మొదటి చిత్రం. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.’
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి రిలీజ్ కావడంతో సినిమా ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ ట్రేడ్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది గనుక హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.