Prabhas-Saaho-1500Crరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సాహో’ కోసం ఆయన అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఆగస్టు 15న థియేటర్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ‘సాహో’ వాయిదా పడిందనే వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ చిత్రం విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. .

సినిమా వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేష్ ‘ఎవరు’ చిత్రాలను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘సాహో’ వాయిదా ఖాయమని అంటున్నారు. మరోపక్క సినిమా బృందం వాయిదా గురించి గానీ కొత్త రిలీజ్ డేట్ గురించి గానీ పెదవి విప్పడం లేదు. అయితే దీనికి బలమైన కారణం ఉందంట. “నాలుగు భాషల్లో ఒకేసారి సినిమా విడుదల చెయ్యాలి అంటే మాటలు కాదు. అటువంటి సమయాలలో అందరు పంపిణీదారులను కూర్చోబెట్టి మాట్లాడాలి,” అని చిత్ర బృందం అంటుంది.

అయితే బాలీవుడ్ నిర్మాత టీ-సిరీస్ నిర్ణయమే కీలకం కాబోతుందని తెలుస్తుంది. నిర్మాతలు పంపిణీదారులతో ఈ విషయంగా మాట్లాడుతున్నారు. తొందరలో ఒక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. సాహో చిత్రంలో బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దక్షిణాదిన ఇదే ఆమె మొదటి చిత్రం. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ట్రేడ్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది గనుక హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.