దర్శకుడు సుజీత్ సైన్ కెరీర్ లో ఎప్పుడూ సర్ప్రైజ్లే. కేవలం ఒక చిత్రానికి దర్శకత్వం వహించిన తరువాత అతను, బాహుబలి వంటి పెద్ద హిట్ తరువాత ప్రభాస్ ను దర్శకత్వం వహించగలిగాడు. కానీ అతను సాహోతో ఫ్లాప్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ అతనిని తీసి పారేయడం మొదలు పెట్టిన సమయంలో, అతను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించగలిగాడు
ఇప్పుడు అతను లూసిఫర్ రీమేక్ కు దర్శకత్వం వహిస్తాడు. “ప్రభాస్ వల్లే సుజీత్కు ఈ అవకాశం లభించింది. కొత్త చిత్రం కోసం స్క్రిప్ట్ గురించి చర్చించడానికి ప్రభుస్ సుజీత్ను రామ్ చరణ్ను కలిసేలా చేశాడు. అయితే, రామ్ చరణ్ లూసిఫెర్ రీమేక్ అవకాశం ఇచ్చాడు, దానిని అతను కాదనలేకపోయాడు” అని ప్రభాస్కు సన్నిహిత వర్గాలు చెప్పాయి.
చిరంజీవి, సుజీత్ ప్రస్తుతం వీడియో కాల్స్ లో స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. చిరంజీవి ఇమేజ్కి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆ స్క్రిప్ట్ కు మార్పులు చేస్తున్నారు. లూసిఫెర్ రీమేక్ ఈ సంవత్సరం చివరిలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో యువి క్రియేషన్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 14న విడుదల చెయ్యాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే ఆచార్య అప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది.