trisha-krishnanఇటీవల కాలంలో చెన్నై సోయగం త్రిష పేరు మీడియా వర్గాలలో బాగా వినపడుతోంది. నిజానికి ఎప్పుడూ ఏదొక హంగామా చేస్తూ త్రిష లైంలైట్ లోనే ఉంటుంది గానీ, ఇటీవల మాత్రం ఆ ఒరవడి ఇంకాస్త ఎక్కువైంది. ముఖ్యంగా ‘సుచిలీక్స్’ పేరుతో రానా – త్రిషల ఫోటోలు విడుదల కావడం దగ్గర నుండి, న్యూ ఇయర్ వేడుకలకు థాయిలాండ్ లో ధనుష్ – త్రిషలు కలిసి హల్చల్ చేసిన ఫోటోల వరకు అమ్మడి హంగామా కనపడింది. అయితే ఇది సర్దుకునేటంతలో తాజాగా మరొక అంశం త్రిషపై సందడి చేస్తోంది.

టాలీవుడ్, కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన త్రిష అనారోగ్యానికి గురైందని, ఇందు నిమిత్తం హైదరాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లో సైలెంట్ గా చికిత్స పొందుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఈ వార్తపై ఆరా తీయడానికి, హైదరాబాద్, మద్రాసులోని వివిధ పత్రికా కార్యాలయాలకు ఫోన్లు వెల్లువెత్తాయి. త్రిష ఆసుపత్రిలో చేరిందా? అంటూ పలువురు ప్రశ్నించడం ప్రారంభించారు.

ఈ పరిణామాలతో మీడియా ప్రతినిధులు త్రిషను సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆమె అందుబాటులోకి లేకపోవడంతో, మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే చివరికి త్రిష తల్లి ఉమా కృష్ణన్‌ ను సంప్రదించగా, అవన్నీ కేవలం పుకార్లేనని, త్రిష క్షేమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె మలేషియాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద స్వామికి జతగా రూపొందుతున్న “సతురంగవెట్టై-2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని చెప్పడంతో, ఉత్కంఠ వీడింది.