Rajamouli-Already-Solved-'Sye-Raa'-Problem-for-RRRఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదల చెయ్యబోతున్నాం అని నిర్మాతలు అప్పట్లో ప్రకటించారు.

అయితే తాజాగా సినిమా అప్పుడు విడుదల అయ్యే అవకాశం లేదని, అసలు 2020లోనే ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లోని పరిస్థితిని బట్టి ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి గానీ వేసవికి గానీ విడుదల అవుతుందని ఫిలింనగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. షూటింగ్ అవ్వకపోవడమే కారణమని అంటున్నారు.

దీనికి ఒక కారణం రాజమౌళి పర్ఫెక్షనిజం అయితే ఇంకోటి ఆర్టిస్టుల డేట్స్ అట. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఇబ్బంది లేకపోయినా, బాలీవుడ్ స్టార్స్ తో మాత్రం ఇబ్బంది తప్పడం లేదట. ఆలియా భట్ డేట్స్ విషయంలో కొంత సర్దుబాటు అవుతున్నా అజయ్ దేవ్ గణ్ విషయంలో అలా లేదు.

కారణం అజయ్ దేవ్ గణ్ ఇప్పటికే ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడైన తన్హాజి వీరోచిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి షూటింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తన్హాజి చిత్రం విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. దీనితో అజయ్ దేవ్ గణ్ పూర్తిగా ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల అయ్యాకే అజయ్ దేవ్ గణ్ పూర్తి స్థాయిలో ఆర్ఆర్ఆర్ కి అందుబాటులో ఉండగలరు. దానితో ఇప్పటికే వేసుకున్న షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందట. అది కూడా సినిమా రిలీజ్ పై ఇంపాక్ట్ చూపుతుందట.