Alia-Bhatt-Falling-for-Rajamouli-Is-a-Blunder,-Says-Mediaఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో ఇబ్బందులు పడుతుంది. ఈ అమ్మడికి గత రెండు రోజులలో ఇంస్టాగ్రామ్ లో ఐదు లక్షల ఫాలోయర్స్ ని కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే…. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణ వార్త తెలిసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహర్‌ను, సల్మాన్ ఖాన్‌ను, అలియా భట్‌ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అందరిలోనూ కరణ్ జోహర్, అలియా భట్‌ను మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అలియా భట్ ఓ ప్రశ్నకు గానూ సుశాంత్‌ను చంపేయాలి అని సమాధానం చెప్పింది. అయితే అదే నిజమైందని నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే చంపేశారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

సుశాంత్ మరణానంతరం ఆలియా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. అయితే అదంతా దొంగ బాధ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆలియా అంకుల్, మహేష్ భట్ సుశాంత్ ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు అని చేసిన వ్యాఖ్య కూడా ఆలియాని ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతుంది.

మే నెలలో ఆలియా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు. ఈ సినిమాలో ఆమె అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్న రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఇదే తెలుగులో ఆమె తొలి చిత్రం. ఆమె పాత్ర నిడివి కూడా చిన్నదే అని సమాచారం.