Rhea Chakraborty might be arrestedదివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఖాతాలోని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముంబైలో ప్రస్తుతం నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఈ నటి కొద్దిసేపటి క్రితం ఏజెన్సీ ముందు హాజరైంది.

మరోవైపు బీహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అలాగే రియా చక్రవర్తి మాజీ మేనేజర్ శ్రుతి మోడీ, మరియు నటి సహచరుడు శామ్యూల్ మిరాండా పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.

ఈ కేసులో నటిని అరెస్టు చేయవచ్చని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ కేసులో ఉన్నారని వదంతులు వ్యాపించడంతో ఈ వివాదం రాజకీయ రంగులను పులుముకుంది. సెంట్రల్ ఏజెన్సీల ప్రమేయం అంటే ఈ కేసులో కాంగ్రెస్ – శివసేన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి బిజెపి ఆసక్తి చూపుతోంది.

మరోవైపు… సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ రేపటిలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.