ప్రస్తుతం జరుగుతున్న టీ20 మహిళల, పురుషుల పోటీలను పరిశీలిస్తే… భారత జట్టు మహిళలలో పరాజయం పాలైనప్పుడు పురుషుల జట్టు జయకేతనం ఎగురవేస్తోంది. పాకిస్తాన్ పై మహిళలు ఓటమి పాలవ్వగా, అదే సమయంలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అలాగే, మొన్న ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు మహిళా జట్టు ఓటమితో టోర్నీ నుండి నిష్క్రమించగా, అదే రోజు టీమిండియా గెలిచి సెమీస్ కు చేరింది. ఇలా ‘రివర్స్’ ఫార్ములా టీమిండియాకు బాగా వర్కౌట్ అవుతోందని అభిమానులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.
అయితే ఇదే ఫార్మూలా నేడు కూడా కార్యరూపం దాలిస్తే, ఫైనల్లో టీమిండియానే అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. నేడు జరిగిన టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై వెస్టిండీస్ మహిళల జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో దూసుకెళ్లింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్తో తలపడనుంది. మహిళా జట్టు విజయం సాధించింది కనుక మెన్స్ టీం పరాజయం పాలయితే విజయం టీమిండియాను వరించినట్లేగా..!
‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ ‘క్రికెట్’ సెంటిమెంట్ ను ఒక్క సీన్ లోనే అద్భుతంగా చూపించారు. అలాంటి ఎన్నో సెంటిమెంట్లలో ఈ ‘రివర్స్’ సెంటిమెంట్ కూడా ఒక్కటన్న మాట. మరి ఏమవుతుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.