కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికతో ఆరోగ్య శాఖ నివేదిక ఇప్పటికే సమర్పించగా, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఈ సిఫార్సులను ప్రభుత్వం యధాతధంగా అంగీకరిస్తే… బార్లు మూసివేయబడతాయి… అలాగే థియేటర్లలో ఆక్యుపెన్సీ 50% కి మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలను మాత్రమే మూసివేసింది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని పలు రాష్ట్రాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి.
ఈ నెల చివరి వరకు మహారాష్ట్ర థియేటర్లను పూర్తిగా మూసివేసింది. 50% ఆక్యుపెన్సీతో చిత్ర పరిశ్రమ కొంత మేర అడ్జస్ట్ అవుతుంది గానీ నైట్ కర్ఫ్యూ పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవని భావిస్తుంది. 50% ఆక్యుపెన్సీ ప్రకటించినట్లయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎలా జరిగిందో అలానే… పెద్ద చిత్రాలకు బదులుగా చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి.
ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్ వంటి సినిమాలు వాయిదాను అధికారికంగా ప్రకటించాయి. కొన్నిపెద్ద సినిమాలు ఆ దిశగా అనధికారికంగా సూచనలు పంపాయి. ఈ గ్యాప్ ను ఇష్క్ (జాంబీ రెడ్డి తేజ హీరో) వంటి సినిమాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.