reliance-jioటెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో సరికొత్త రికార్డులను సాధిస్తోంది. ‘ఆల్ ఫ్రీ’ అన్న ఒక్క ప్రకటనతో దేశవ్యాప్తంగా వినియోగదారులు క్యూలు కట్టారు. ఈ ప్రభావం గణాంకాల రూపంలో తాజాగా బయటకు వచ్చింది. కేవలం 26 రోజుల్లో 1 కోటి 60 లక్షల మంది వినియోగదారులు జియో చెంత చేరారు. ఇదేమి సాధారణ విషయం కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అది కూడా కేవలం దాదాపు ఒక నెలలో ఇంతమంది కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకోవడం పట్ల ముఖేష్ అంబానీ కూడా సంతోషం వ్యక్తపరిచారు.

వినియోగదారుల నుండి వచ్చిన స్పందనకు ధన్యవాదాలు తెలిపిన అంబానీ, తమ జియో సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకుంటున్నందుకు సంతృప్తిగా ఉందని అన్నారు. ఇండియాలో 3100 సిటీస్ లో జియో సిమ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే ఈ జియో సిమ్ లు దక్కించుకున్న వినియోగదారులలో ఎక్కడా ఫేక్ కు తావు లేకుండా ఆధార్ కార్డు అనుసంధానంతో ఖచ్చితమైన నిబంధనలతో ఇస్తున్నారు. దీంతో తన కస్టమర్లలో ఎక్కడా పొరపాట్లకు తావు లేదని ప్రకటించుకుంది.