తెలుగు పరిశ్రమలో ఈ మధ్య బాగా హాట్ అయిన ప్రేమ జంట సాయి ధరమ్ తేజ్, రెజీనా. వీరిద్దరూ కలిసి పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలకు పనిచేసేటప్పుడు వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ బాగా పెరిగింది. ఇద్దరూ చెట్టాపట్టా లేసుకుని తిరుగుతూ ఓపెన్ గానే రిలేషన్ షిప్ కంటిన్యూ చేశారు. దీంతో టాలీవుడ్ మొత్తం వీరి గురించి కోడై కూసింది. కానీ ఈ మధ్య వీరిద్దరూ మునుపటిలా కాకుండా కాస్త దూరంగా ఉంటున్నారు. దీంతో వీరి మధ్య బ్రేకప్ అయిందని అందరూ అనుకున్నారు.
ఇదే విషయాన్ని రెజినాను అడగ్గా ‘అబ్బే అలాంటిదేమీ లేదు. మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పుడు మా మధ్య ఏదో ఉందని అందరూ అన్నారు. మరిప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేయకపోవడం వల్ల మాకు బ్రేకప్ అయిందని అంటున్నారు. అసలు మా ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే కదా బ్రేకప్ అవడానికి. మేము మంచి ఫ్రెండ్స్ అంతే. ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా తెలియడం లేదు’ అంటూ పుకార్లకు ఫులుస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.