Pawan -Kalyan - Panchekattuజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ఎక్కువగా పంచె కట్టులో కనపడటం మనం చూస్తూనే ఉన్నాం… దాని వెనుక ఉన్న సీక్రెట్ ను ఆయన చెప్పారు. మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని వివరించారు.

సమాజం, దేశం కోసం చనిపోవడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి తూ.గో జిల్లాలో పితాని బాలకృష్ణ పేరు మాత్రమే ప్రకటించామన్నారు. తితిలీ తుఫాను వల్ల అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లి మళ్లీ తూ.గో జిల్లాలో పర్యటిస్తానని పేర్కొన్నారు.

గోదావరి జిల్లాలంటే అందరికీ ఇష్టం ఉంటుందని, అలాంటి జిల్లాలో ఆక్వా భూతంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు రావాలని ఆకాంక్షించిన పవన్‌ కళ్యాణ్.. ప్రజలను భయపెట్టి భూములు లాక్కోకూడదని ప్రభుత్వానికి సూచించారు