మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్, ఖిలాడి దాని షూట్లో 40% పూర్తి చేసింది. ఈ మూవీ షూట్ ప్రస్తుతం కూకట్ పల్లిలోని ప్రగతినగర్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం జనవరిలో తదుపరి షెడ్యూల్ కోసం ముంబైకి వెళ్తుంది. ముంబై షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగుతుంది.
దానితో 55% షూట్ జరుగుతుంది. సమ్మర్ 2021 లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. మీనాక్షి ప్రస్తుతం సుశాంత్ యొక్క ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది.
వరుణ్ తేజ్ గడ్డలకొండ గణేష్ లో డింపుల్ హయాతి ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సౌండ్ట్రాక్లను అందిస్తుండగా, లూసిఫెర్ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ కెమెరాను క్రాంక్ చేస్తున్నారు. గతంలో రవితేజతో వీర వంటి డిజాస్టర్ అందించిన రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తుంది ఖిలాడి. అయితే రమేష్ వర్మ ఇటీవలే రాక్షసుడు సినిమా తో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు.
రవితేజ గత కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ఏవీ రాణించక స్పష్టంగా కష్టపడుతున్నాడు. ప్రతి వైఫల్యంతో నటుడు తన మార్కెట్ను కోల్పోతున్నాడు. దానితో ఈ సినిమా, అలాగే ఇప్పటికే రిలీజ్ కి రెడీ గా ఉన్న క్రాక్ సినిమాల మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. క్రాక్ జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.