Rashmika Mandannaఈ ఏడాది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు హిట్స్ సాధించిన ఏకైక హీరోయిన్ రష్మిక మందన్న. కరోనావైరస్ పరిశ్రమను పూర్తిగా ఎక్కడిది అక్కడ ఆపడానికి ముందు ఆమె మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరూ మరియు నితిన్ యొక్క భీష్మాతో రెండు హిట్స్ సాధించింది. ఈ నటి ప్రస్తుతం తన సొంత ఊరైన కూర్గ్‌లో ఐదు నెలలుగా తన ఫ్యామిలీతో కాలం గడుపుతుంది.

“ఈ రోజుల్లో నేను చేస్తున్నది ఆన్‌లైన్ కాల్స్ ద్వారా స్క్రిప్ట్‌లను వినడం మాత్రమే. ఇక ఏ పనీ లేదు. అయితే, మా నాన్న గారి కంపెనీ మరియు నా దగ్గర 20 మంది ఉద్యోగులు ఉన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వడం మాత్రమే కాకుండా… వారి కుటుంబాలలో పని కోల్పోయిన వారికి కూడా జీవనోపాధికి ఇతర మార్గాలు లేనందున… మేము వారికి మద్దతు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము, “నటి మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తన దగ్గర పని చేస్తున్న వారినే కాకుండా… వారి కుటుంబాలలో ఇతరులను కూడా ఆదుకోవడం అంటే కచ్చితంగా అభినందించాల్సిందే. షూటింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె అల్లు అర్జున్ పుష్పా షూటింగ్ మొదలు పెట్టనుంది. పుష్పాలో ఆమె ఒక పల్లెటూరి అమ్మాయిల కనిపించనుంది.

ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా యాస కూడా నేర్చుకుంది. అంతా కుదిరితే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పాలనుకుంటుంది. ఈ సినిమా గనుక పెద్ద హిట్ అయితే రష్మిక కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు.