Rashmika Mandannaఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూ, భీష్మా సినిమాలతో కలిపి టాలీవుడ్ లో రెండు హిట్‌లు సాధించిన ఏకైక హీరోయిన్ రష్మిక. ఈ నటి ఇప్పుడు తన తదుపరి చిత్రం పుష్పా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో రష్మిక తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. కానీ పుష్పా కోసం ఆమె చిత్తూరు యాసలో మాట్లాడాల్సి రావడంతో అదంతా సులభమైన విషయం కాదు. ఈ లోక్ డౌన్ కాలంలో చిత్తూరు యాస‌పై నైపుణ్యం సాధించడానికి ఈ నటి చాలా కష్టపడుతుందని సమాచారం.

లాక్ డౌన్ తర్వాత ఆమె డబ్బింగ్ పై ఒక అంచనా వేయబడుతుంది. ఒకవేళ, ఆమెకు ఏమైనా ఇబ్బంది ఉంటే, సుకుమార్ ఆమె బదులుగా డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకువస్తాడు. శేషచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ చిత్రం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతించడంతో ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనేది చూడాలి.

పుష్పా సమ్మర్ కి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు. అయితే కరోనా బ్రేక్ వల్ల అది కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు… ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మొదలుపెట్టాడు. రెండు మూడు ట్యూన్లు కూడా సిద్ధమైనట్టు సమాచారం.