rangasthalam-teaser-ram-charanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “రంగస్థలం” ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో మార్చి 30వ తేదీన విడుదల కావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. గత సినిమాలలో చెర్రీ వీక్ నెస్ గా భావించిన కామెడీని, ఈ సినిమాలో అభిమానులను మెప్పించేలా చెర్రీ చేత చేయించారన్న సమాచారం ఇప్పటికే హల్చల్ చేస్తుండగా, తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చేత సుకుమార్ రాజకీయాలను కూడా టచ్ చేసి చూపించారని తెలుస్తోంది.

ముఖ్యంగా 1985 నేపధ్యంలో ఉన్న మండల స్థాయి గ్రామీణ రాజకీయాలను సుకుమార్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచే అంశాలలో ఇవి కూడా ఉంటాయని ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోన్న టాక్. గోదావరిలో పడవ నడిపే వ్యక్తిగా చిట్టిబాబు చెవిటి పాత్ర అద్భుతమైన హాస్యంతో పాటు రాజకీయ చాతుర్యతను కూడా పండించబోతున్నాడన్న మాట. సుకుమార్ ఇంకెన్ని జిమ్మిక్కులు చేసారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.