Rangasthalam 1985 movie reshootసుకుమార్… చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అయితే సుకుమార్ రీ షూట్ పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కొన్ని సన్నివేశాలను గోదావరి జిల్లాలలో చేసిన సుకుమార్, ఆ తరువాత అనుకున్నట్టుగా అక్కడ ఎక్కువ రోజులు షూట్ చేయలేమని భావించాడు.

ఆ కారణంగానే హైదరాబాద్ లో ప్రత్యేకమైన భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అలా తీసిన సీన్స్ ఇప్పుడు సుకుమార్ కి అంతగా సంతృప్తికరంగా అనిపించడం లేదట. ఈ కారణంగానే ఆయన మళ్లీ గోదావరి జిల్లాల్లో షూటింగ్ పెట్టినట్టుగా సమాచారం.

అందుకు రామ్ చరణ్ కూడా అంగీకరించి కొన్ని డేట్స్ కూడా ఇచ్చాడట. ఈ నెల చివరిలోగా రీ షూట్ పూర్తి చేసి, వచ్చే నెలలో బోయపాటి సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అవుతాడన్న మాట. రీ షూట్ పెట్టుకున్నారన్న వార్తలతో మార్చి 30 నాటికి సినిమా వస్తుందా? లేదా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.