rana daggubati virata parvamగుణశేఖర్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, రానా దగ్గుబాటి హీరోగా ప్లాన్ చేస్తున్న హిరణ్య, ఇప్పుటికే మూడేళ్ళకు పైగా ప్రీ-ప్రొడక్షన్ లో ఉంది. రానా తండ్రి సురేష్ బాబు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం ఇది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.

అయితే సురేష్ బాబు దానిని నిలిపివేయాలని కోరుకుంటున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ” ఇప్పుడున్న పరిస్థితులలో 180 కోట్ల పెట్టుబడులు పెట్టడం చాలా పెద్ద రిస్క్, రాబోయే నెలల్లో ఆర్ధిక మందగమనం కారణంగా చాలా అనిశ్చితి ఉంటుంది. సాధారణ స్థితి పునరుద్ధరించబడిన తర్వాత ఈ చిత్రం తిరిగి ప్రారంభమవుతుంది” అని సురేష్ బాబుకు దగ్గర వర్గాలు అంటున్నాయి.

అదే జరిగితే, సినిమా ఒక సంవత్సరం పాటు సెట్స్ మీదకు వెళ్ళకపోవచ్చు. బడ్జెట్ను తగ్గించి మొదలు పెట్టడం ఒక ఆప్షన్ గా అనుకున్నా, అటువంటి పని చేస్తే ప్రాజెక్ట్ కు మంచిది కాదని సురేష్ బాబు ఒక నిర్ణయానికి వచ్చారట. సురేష్ బాబు ఇప్పటికే ఈ చిత్రం కోసం గణనీయమైన మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ ఆలస్యం వల్ల కూడా ఆయనకు నష్టమే.

అయితే ఈ నష్టం కంటే సినిమా కొనసాగిస్తే వచ్చే నష్టమే ఎక్కువని ఆయన భావిస్తున్నారట. చాలా ఇంటర్వ్యూలలో రానా హిరణ్య తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇది ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి. ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కాలం కష్టపడిన గుణశేఖర్ కు కూడా ఇబ్బందే.