ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చి, పాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత మాజీ కాంగ్రెస్ యువ ఎంపీ రమ్య వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారి మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా నిలిచారు. కాంగ్రెస్ పై తనకున్న అభిమానం, ప్రేమను కురిపిస్తూ బిజెపిని విమర్శించే క్రమంలో రమ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఇండియా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నాయని, కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తున్న వేళ, బీజేపీ ఏమైపోయిందని, వీధుల్లో పోరాటాలతో స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ శ్రమిస్తున్న వేళ, బ్రిటీష్ వారితో బిజెపి చేతులు కలిపిందని చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. అలాంటి బిజెపి వాళ్ల దగ్గర దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడింది.
నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా వర్గాలలో నానుతూ, సామాజిక మాధ్యమాలలో విమర్శలు ఎదుర్కొవడం ఈ కన్నడ నటి, మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యకు షరామామూలుగా మారిపోయింది. అతి చిన్న వయసులో ఎంపీ అయిన రికార్డును సొంతం చేసుకున్న రమ్య విమర్శలలో పరిపక్వత లోపించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.