గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టీడీపీ ఓటమిలో ఆ సినిమాది కూడా చిటికెడు పాత్ర ఉండొచ్చు. తాజాగా ఆయన తాను పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.
“ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్ స్టార్ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను’ అంటూ అవహేళనగా ప్రకటన కూడా చేశారు. ఇది ఇలా ఉండగా…. అప్పుడు టీడీపీని ఇప్పుడు జనసేనను రామ్ గోపాల్ వర్మ తో టార్గెట్ చేయిస్తుంది జగన్ పార్టీనే అని చాలా మంది అభిప్రాయం.
సాక్షి టీవీతో ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చాలా అవహేళనగా మాట్లాడారు. పవన్ అభిమానులు మిమ్మల్ని సెక్యూరిటీ లేకుండా బైటకిరా చూసుకుందామంటున్నారు ఏమంటారు? అని యాంకర్ అడగగా… “వారి వీరత్వం ట్విట్టర్ లొనే .. వారికంత సీన్ లేదు .. మహేశ్ కత్తిపై అన్నాళ్లు గోల జరిగింది .. ఏం చేశారు?,” అంటూ రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు.
ఇకపోతే తన క్లైమాక్స్, నగ్నం సినిమాలవలే పవర్ స్టార్ సినిమాని కూడా ఆన్ లైన్ లోనే విడుదల చెయ్యనున్నట్టు రాము ప్రకటించారు. అయితే ఈ సినిమా రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ వర్మ పూర్తి చెయ్యాల్సి ఉంది.