Ram-Charan--Sandeep-Reddy-Vanga“అర్జున్ రెడ్డి” సినిమాతో సంచలన దర్శకుడిగా ఖ్యాతి గడించిన సందీప్ రెడ్డి వంగాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తదుపరి చిత్ర హీరోగా ఇప్పటికే శర్వానంద్ ను ఫైనల్ చేసుకున్న సందీప్ జాబితాలో ఇంకెవరూ ఉన్నారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ తో దిగిన ఓ ఫోటో కొత్త ఊహాగానాలకు తెరతీసింది.

చరణ్ వైఫ్ ఉపాసన తయారు చేసిన క్రిస్మస్ ట్రీ దగ్గర చరణ్ .. సందీప్ రెడ్డి .. శర్వానంద్ .. యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ కలిసి ఫోటో దిగారు. చరణ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో చరణ్ సినిమా ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ఫోటోలో ఉన్న శర్వానంద్ – సందీప్ రెడ్డిల సినిమా ఖరారైంది.

ఇక ఈ ఫోటోలో ఉన్న మరో వ్యక్తి… యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీ ‘రంగస్థలం’ సినిమా నైజామ్ రైట్స్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. అదీ కాదంటే సందీప్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ – శర్వానంద్ ల కాంబోలో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతుందేమో అన్న టాక్ కూడా ఉందిలెండి! ఇలాంటి ఊహాగానాలకు టాలీవుడ్ లో కొదవ ఉండదుగా!