మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కోవిడ్ రెండవ వేవ్ తర్వాత షూట్ తిరిగి ప్రారంభించిన మొదటి స్టార్. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇంకా 35 పని దినాల షూటింగ్ మిగిలి ఉంది. ఇందులో మెజారిటీ రామ్ చరణ్ భాగాలని సమాచారం.
ఇదిలావుండగా, ఆచార్య టీమ్ జూలై మొదటి వారంలో షూట్ తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. ఆ సినిమాలో రామ్ చరణ్ విప్లవ యువ విద్యార్థి నాయకుడిగా కొంచెం పెద్దదైన అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆచార్య లో రామ్ చరణ్ కు అటుఇటుగా ఒక వారం పని మిగిలి ఉంది. అవసరమైతే డబుల్ షిఫ్టులలో షూట్ చేయడానికి చరణ్ ముందుకొచ్చినట్లు సమాచారం.
అయితే, రాజమౌళి కి ఇది ఎంత మాత్రం రుచించడం లేదట. మంచి అవుట్పుట్ కోసం తన సినిమాలోని హీరోలు తన సినిమా మూడ్లో ఉండాలని ఈ దర్శక దిగ్గజం ఎప్పుడూ కోరుకుంటాడు. దానితో రాజమౌళి దానిని అనుమతిస్తారా అని చూడాలి. అసలైతే తన హీరోలు సినిమా విడుదలయ్యే వరకు ఇంకో సినిమా చెయ్యడానికి రాజమౌళి ఒప్పుకోడు.
అయితే చిరంజీవి స్వయంగా అడగడంతో కాదనలేక రాజమౌళి ఆచార్య చెయ్యడానికి రామ్ చరణ్ కు పర్మిషన్ ఇచ్చాడు. తన షూటింగ్ కు ఇబ్బంది కలగకుండా షూట్ చేసుకుంటాం అని చెప్పారు అప్పట్లో. ఇప్పుడు ఏకంగా డబల్ షిఫ్ట్ అంటే రాజమౌళి కి ఇబ్బందే. ఆచార్య దసరా విడుదల కోసం ట్రై చేస్తుండగా, ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కి విడుదల అవుతుంది.