ram charan helped Mythri Movie Makers to reach salman khanఅనతి కాలంలోనే టాలీవుడ్ లోనే పెద్ద బ్యానర్ గా అవతరించింది మైత్రి మూవీ మేకర్స్. ఇక్కడ బడా సినిమాలు నిర్మించిన ఆ సంస్థ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుంది.

సల్మాన్ దగ్గరి బంధువైన నిర్మాత అతుల్ అగ్నిహోత్రిని కూడా కలిశారు. అతుల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సల్మాన్ కు ఏకంగా 10 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే సల్మాన్ దగ్గరకు వారికి యాక్సిస్ ఇచ్చింది రామ్ చరణ్ అని సమాచారం.

రామ్ చరణ్ తో మైత్రి వాళ్ళు రంగస్థలం తీశారు. మెగా ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ కు ఉన్న అనుబంధం తెలిసిందే. దానితో వారిని రామ్ చరణ్ సల్మాన్ కు పరిచయం చేశాడట. సల్మాన్ ఖాన్ తాజా కమిట్మెంట్స్ అన్ని అయిపోయాకా ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందంట.

ఇక జనతా గ్యారేజ్ – రంగస్థలం వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం మైత్రి మూవీ మేకర్స్ పెద్ద హిట్స్ అందుకోలేకపోయింది. అమర్ అక్బర్ ఆంటోని – డియర్ కామ్రేడి – గ్యాంగ్ లీడర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ – అల్లు అర్జున్ 20వ సినిమాలతో రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను కూడా ఇదే బ్యానర్ లో రూపొందనుంది.