rakul-preet-singh--naga-chaitanya‘పవర్’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బాబీ, ఆ తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవకుశ’ సినిమాలతో ప్రతికూల ఫలితాలను చవిచూసాడు. పవన్ సినిమా దారుణంగా పరాజయం పాలు కాగా, ఎన్టీఆర్ మూవీ ‘యావరేజ్’తో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ – నాగచైతన్యలతో కలిసి మల్టీస్టారర్ కు రూపకల్పన చేస్తోన్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక పూర్తయ్యిందనేది లేటెస్ట్ న్యూస్.

గతంలో విక్టరీ వెంకటేష్ తో “లక్ష్మీ, తులసి, బాబు బంగారం” వంటి సినిమాలలో కనిపించి అలరించిన నయనతార మరోసారి కన్నులవిందు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అలాగే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ద్వారా హాట్ పెయిర్ గా దర్శనమిచ్చిన చైతూ – రకుల్ ప్రీత్ సింగ్ లు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైందని టాక్. అధికారికంగా ధృవీకరించని ఈ హీరోయిన్ల పేర్లను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడిస్తుందని సమాచారం.