Rakul Preet Singh Remunerationహృదయాన్ని తాకే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ కోవలోకే ఇటీవల నాని నటించిన “నిన్ను కోరి” సినిమా వచ్చి చేరిందన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సగటు ప్రేక్షకులనే కాదు, చాలా మంది సినీ సెలబ్రిటీల హార్ట్ ను టచ్ చేసిందన్న విషయం… సోషల్ మీడియా ద్వారా తెలిసిందే. ఆ జాబితాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందన్న విషయం తాజాగా చెప్పుకొచ్చింది.

ఆగష్టు 11వ తేదీన విడుదల కాబోతున్న “జయ జానకి నాయక” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న రకుల్ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. సాధారణంగా సినిమాలు చూసి తాను ఏడవను గానీ, ఇటీవల చూసిన “నిన్ను కోరి” సినిమా చూస్తున్నపుడు ఎక్కువ శాతం ఏడుస్తూనే ఉన్నానని, తన పక్కన కూర్చున్న తమ్ముడు టిష్యూ పేపర్లు అందించాడని, సినిమా అయిపోయిన తర్వాత నానికి ఫోన్ చేసి… “ఏడిపించేసావ్… అలా ఎందుకు ఏడిపించావ్… మీ ఇద్దరూ కలవాలి కదా…” అన్నాను.

తాను బేసిక్ గా రొమాంటిక్ అంటే బాగా ఇష్టపడతానని, అందుకే ట్రాజిక్ లవ్ స్టోరీలు తనకు నచ్చవని, అయితే ఈ “జయ జానకి నాయక”లో నా పాత్ర కూడా ఫుల్ ఏమోషన్స్ తో ఉంటాయని, సినిమాలో ఎక్కువ శాతం ఏడుస్తూనే ఉంటానని, 25 రోజుల పాటు అలా డిప్రెషన్ లో ఉంటూనే షూట్ చేసామని, సినిమా కధ మొత్తం ‘జానకి’ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, ఒక ప్రేక్షకురాలిగా సినిమా చూస్తున్నపుడు హార్ట్ ను టచ్ సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయని, ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు బోయపాటి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపింది రకుల్,