ఇటీవల రిలీజ్ అయిన ‘లస్ట్ స్టోరీస్’లో కైరా అద్వానీ ఎపిసోడ్ ఎంతగా హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ పక్కన బాలీవుడ్, టాలీవుడ్ లలో బడా సినిమాలు చేస్తోన్న కైరా, ‘అడల్ట్’ కంటెంట్ తో చేయడం ఓ రకంగా షాకింగ్ విషయమే అయినా, నవతరం కధానాయికల అభిరుచులకు ఈ ‘లస్ట్ స్టోరీస్’ అద్దం పడుతోంది. సెన్సేషన్ గా మారిన దీనిని టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చూడడం, ట్విట్టర్ వేదికగా మెచ్చుకోవడం కూడా జరిగిపోయాయి.
‘లస్ట్ స్టోరీస్ అనేది ఒకడుగు ముందుకేసి తెరకెక్కించిందని, మనుషుల కోరికలను హైలైట్ చేయడం, పాతకాలపు ఆలోచనలను బ్రేక్ చేయడం బాగుందని, ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా నటించారంటూ’ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపింది. రకుల్ కు ఇలాంటి స్క్రిప్ట్ నచ్చింది అంటే భవిష్యత్తులో అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమే అన్నట్లు సంకేతాలు పంపడమే కదా! ఏమో నేటితరం ముద్దుగుమ్మలు ఎలాంటి పాత్రలనైనా చాలెంజింగ్ గా తీసుకుని చెలరేగిపోతున్నారు.