టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా వరుసగా పెద్ద హీరోల సినిమాలలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నాడు నెల్లూరులో సందడి చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన రకుల్… అభిమానులతో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ సెంటర్ లో నెలకొన్న ఈ ప్రారంభోత్సవంలో రకుల్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ… ‘థ్యాంక్యూ నెల్లూరు.. చాలా ప్రేమను చూపించారు….’ అని అమ్మడు పేర్కొంది. చీర కట్టులో ఆమె కనపడిన తీరు అందరినీ అలరించింది.