రియా చక్రవర్తి కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
విచారణ సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇందులో బాలీవుడ్ భామల సారా అలీ ఖాన్, డిజైనర్ సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది.
రకుల్ పేరు రావడం టాలీవుడ్ వర్గాలలో సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఒక కాంపెయిన్ నిర్వహించింది. అందులో రకుల్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. ఆ తరుణంలో ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో రకుల్ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములు పట్టే వాడు పాము కాటుకు బలి అయినట్టు ఉంది ఈ వ్యవహారం అంటూ పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రకుల్ ఇప్పటివరకూ ఈ విషయంగా స్పందించలేదు. చూడాలి ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో!
Aha pic.twitter.com/aIdedTNZbm
— 💣 (@Koratala_fan) September 12, 2020