rakul-preet-singhbusyఆ మధ్య కాలంలో తన పని అయిపోయిందని అంతా అనుకున్న వారిని తప్పు అనిపించేలా ఉంది. లాక్ డౌన్ సమయంలో వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీ అయిపోతుంది. కరణం మల్లేశ్వరి బయోపిక్ లో టైటిల్ రోల్ కోసం ఈ నటిని అనుకుంటున్నారు. దర్శకుడు క్రిష్‌తో కలిసి వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం కోసం కూడా ఆమె ధృవీకరించబడింది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో రకుల్ కూడా షూటింగ్ మొదలుపెడుతుంది. ఇది ఇలా ఉండగా… మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో నాగ చైతన్య తదుపరి చిత్రం కోసం రకుల్ ని ఫైనల్ చేశారని అంటున్నారు . రకుల్ గతంలో నాగ చైతన్యను రారండోయ్ వేడుక చూద్దాం లో హీరోయిన్ గా మెరిసింది.

విక్రమ్ నాగచైతన్య గతంలో మనం క్లాసిక్ సినిమాను ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటం ఖాయం. ఈ సినిమాకు థాంక్ యూ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ ఇచ్చాడట. ఈ నటి నాగ చైతన్య తండ్రి నాగార్జున సరసన ఇటీవల మన్మథుడు 2 లో కూడా కనిపించింది.

మొత్తానికి రకుల్ మరో సారి బిజీ హీరోయిన్ గా మారుతుంది. పారితోషికం విషయంలో కూడా ఆమె కొంత పట్టువిడుపులు ప్రదర్శించడంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారట. ఈ సినిమాలతో కొన్ని హిట్లు సంపాదిస్తే ఆమె కెరీర్ మరోసారి గాడిలో పడినట్టే అని చెప్పుకోవాలి.