rajamouli-shares-the-ghazi-attack-movie-posters‘లీడర్’తో తెరంగ్రేటం చేసిన దగ్గుపాటి వారసుడు రానా, వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ కెరీర్ లో ‘ల్యాండ్ మార్క్’ ఫిల్మ్ సంఖ్యను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బాహుబలి’తో చరిత్రలో నిలిచిపోయే సినిమాలో భాగస్వామి కాగా, తాజాగా మరో సినిమా “ఘాజీ”తో విమర్శకుల ప్రశంసలు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను సృష్టించగా, వీటిని మరింత రెట్టింపు చేసేందుకు బుధవారం నాడు ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

అయితే తాజా పోస్టర్లు ఎంతగా వీక్షకులను కట్టిపడేస్తున్నాయంటే… ఏకంగా ‘దర్శకధీరుడు’ రాజమౌళినే ఈ పోస్టర్లను షేర్ చేసుకుంటూ… పోస్టర్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయని, రానా ఈ సినిమాను ఎప్పుడూ చూపిస్తున్నావు, ఇంకా నిరీక్షించలేను… అంటూ తన ఉత్సుకతను సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు. ఫాంటసీ సినిమాలను తీసే రాజమౌళినే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారంటే… ఇంకా సాధారణ ప్రేక్షకుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అన్నట్లు… ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 17గా చిత్ర యూనిట్ ప్రకటించింది.