Rajamouli -Megastar Chiranjeeviమెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి’ సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ.. తెలుగులో తప్ప మరే భాషలోనూ సక్సెస్ కాలేదు. ఘోరంగా కనీసం రిలీజ్ ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది. హిందీలో 1000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయితే కనీసం ఇప్పటివరకూ 10 కోట్ల నెట్ కూడా ఇప్పటివరకూ కలెక్టు చెయ్యలేకపోయింది.

సైరాలో నేటివిటీ ప్రాబ్లం ఉందని కొందరి అభిప్రాయం. మాములుగానే తెలుగు వారిని హిందీ వారు గుర్తించరు.. మనల్ని ఇప్పటికీ అక్కడ చాలా మంది మదరాసీయులు అనే అంటారు. సైరా కథ రాయలసీమలోని ఒక చిన్న ప్రాంతం జరుగుతుంది. దానితో వారు కనెక్టు కాలేదని కొందరి అభిప్రాయం. అయితే చాలా మంది అనుకుంటున్నట్టు ఈ విషయంలో రాజమౌళికి టెన్షన్ ఏమీ లేదట.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అంటూ ఇద్దరు తెలుగువీరుల కథను తెరపైకి ఆర్ఆర్ఆర్ కోసం తెర మీదకు తెచ్చాడు. వీరిద్దరూ తెలుగు వారు అయినప్పటికీ ఇప్పటికే దాని కోసం ఒక ప్లాన్ వేశాడు. ఆర్ఆర్ఆర్ కథ వీరిద్దరూ ఢిల్లీలో కలిసినప్పుడు జరుగుతుందట. అంటే తెలుగు వీరులు కథ అయినా ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుంది కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండదని రాజమౌళి అభిప్రాయం.

సినిమా కథ గురించి రాజమౌళి చెప్పిన నాడే ఈ ఢిల్లీ నేపథ్యం గురించి చెప్పారు. సో, ఇప్పుడు సైరా చూసి ఆయన కొత్తగా మార్పులేమీ చెయ్యడం లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే జులై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.