ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్ర సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని నిన్న కీరవాణి ఒక ట్వీట్లో తెలిపారు. ఇప్పటివరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఈ చిత్రంలో నటించే ఎవరి పేరూ చిత్ర బృందం ఇప్పటివరకూ ప్రకటించలేదు.
మరో వైపు వచ్చే వారం 14న గానీ 15న గానీ ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ప్రెస్ మీట్ జరగబోతుందట. ఈ సినిమా కు సంబంధించిన విశేషాలు చెప్పబోతున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ , ఒక బ్రిటిష్ నటి ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. దీనికి సంబందించిన క్లారిటీ ఆ రోజు ప్రెస్ మీట్ లో రావొచ్చు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించబోతున్నాడని, రామ్ చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుందని ఇలా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. రూ.300కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారని సమాచారం. తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం.