Rajamouli  EYES digital mediaఏస్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి లాక్డౌన్ విరామం ఎప్పుడు ముగుస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బ్రేక్ వల్ల సినిమా షెడ్యూల్ గజిబిజిగా మారింది. అలాగే అలియా భట్ డేట్స్ కూడా వృధా అయ్యాయి. సాధారణ స్థితి పునరుద్ధరించబడిన తర్వాత, కొత్త షెడ్యూల్‌లు కంఫర్మ్ అవుతాయి.

ఒక ఇంటర్వ్యూలో, రాజమౌళి తన తదుపరి చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఈ ఏస్ డైరెక్టర్‌ను ఇటీవలే బాగా పాపులర్ అవుతున్న వెబ్ సిరీస్ ల భవిష్యత్తు గురించి అడిగారు. “వెబ్ సిరీస్ మా చిత్రాల కంటే చాలా అడ్వాన్సుడ్ గా ఉంటున్నాయి. మేమే చాలా వెనుకబడి ఉన్నాం. ఇండియన్ వెబ్ సిరీస్ అధిక నాణ్యతతో లేదు కాని నాకు ఇటీవలే వచ్చిన స్పెషల్ ఆప్స్ బాగా నచ్చింది. ది ఫ్యామిలీమాన్ గురించి బాగా చెబుతున్నారు. చూడాలి” అని ఆయన అన్నారు.

“నేను కూడా త్వరలో వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ముందస్తు కమిట్మెంట్ల కారణంగా చేయలేకపోతున్నా. ఆ కమిట్మెంట్లన్నీ పూర్తయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక వెబ్ సిరీస్‌ చేస్తాను” అని ఆయన చెప్పారు. రాజమౌళి వంటి పెద్ద డైరెక్టర్ కూడా డిజిటల్ వైపు వస్తే వాటి మీద క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 8, 2021న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే లొక్డౌన్ కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. వాయిదా తప్పకపోతే సినిమా 2021 సమ్మర్ కు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.