తెలుగు ప్రభుత్వాలు లేదా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) రెండింటికి విజయ్ దేవరకొండ ఒక్క పైసా కూడా విరాళంగా ఇవ్వలేదు. గత కొంత కాలంగా మీడియాలో ఇదే హాట్ న్యూస్ అయిపోయింది. దాని గురించి చాలా వ్రాశారు. అయితే, మీడియా మొత్తం ఫోకస్ విజయ్ మీద పెట్టడంతో రాజమౌళి విజయవంతంగా తప్పించుకున్నాడు.
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో ఒకరైన రాజమౌళి ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు. అతను ఇప్పటి వరకు ఎటువంటి విరాళ ప్రకటన చేయలేదు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ గురించి మీడియా పెద్దగా రాసింది లేదు, చర్చించలేదు. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఇటీవల విడుదల చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా యొక్క హైప్ మరియు అంచనాలు అకస్మాత్తుగా రెట్టింపు అయ్యాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్గా మే 20 న విడుదల అయ్యే కొమరం భీమ్ క్యారెక్టర్ వీడియో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను జనవరి 8, 2021న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే లొక్డౌన్ కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే రాజమౌళి మాత్రం అదేమీ లేదని అంటున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80% పూర్తి అయ్యిందని ఆయన మీడియాకు చెప్పారు.